నిజంనిప్పులాంటిది

Aug 15 2023, 16:15

SBI Report: 2047 నాటికి ₹15 లక్షలకు తలసరి ఆదాయం: ఎస్‌బీఐ రీసెర్చ్‌

దిల్లీ: శత స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకునే నాటికి దేశంలో తలసరి ఆదాయం (per capita income) గణనీయంగా పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి (SBI report) పేర్కొంది..

2047 నాటికి తలసరి ఆదాయం ఇప్పుడున్న (2022-23 ఆర్థిక సంవత్సరం) రూ.2 లక్షల నుంచి రూ.14.9 లక్షలకు పెరగనుందని పేర్కొంది. అంటే దాదాపు ఏడున్నర రెట్లు పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు.

2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని మోదీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశమనేది స్వప్నం కాకూడదని.. 140 కోట్ల పౌరుల ప్రతిజ్ఞ కావాలని ఆకాక్షించారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Aug 15 2023, 16:13

Bihar : సీఎం నితీశ్ కుమార్ సభలో భద్రతా లోపం.. యువకుడిని అడ్డుకున్న సిబ్బంది..

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. భద్రతా వలయాన్ని దాటుకుని నితీశ్ వైపునకు పరుగులు తీయబోయాడు..

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అక్కడికక్కడే అడ్డుకోగలిగారు. ఆ యువకుడి పేరు కూడా నితీశ్ కుమార్ కావడం విశేషం.

స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోకి నితీశ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు పరుగు పరుగున దూసుకొచ్చాడు.

ఆయన చేతిలో ఓ పోస్టర్ ఉంది. తన తండ్రి బిహార్ మిలిటరీ పోలీస్ ఉద్యోగి అని, ఆయన ఐదేళ్ల క్రితం విధి నిర్వహణలో ఉండగానే మరణించారని, తనకు కారుణ్య ప్రాతిపదికపై ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని ఆ పోస్టర్లో రాశారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో యువకుడు నితీశ్ కుమార్ సీఎం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి, ఆ యువకుడిని అడ్డుకుని, అక్కడి నుంచి పంపించేశారు.

ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు పాట్నా జిల్లా యంత్రాంగం ఆదేశించింది. పాట్నా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ, సీఎం సభలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడి పేరు నితీశ్ కుమార్ అని గుర్తించినట్లు తెలిపారు. ఆయన తండ్రి పేరు రాజేశ్వర్ పాశ్వాన్ అని తెలిపారు.

ముంగేర్ జిల్లాకు చెందిన రాజేశ్ బిహార్ మిలిటరీ పోలీస్ ఉద్యోగి అని, ఆయన ఐదేళ్ల క్రితం విధి నిర్వహణలో ఉండగా మరణించారని తెలిపారు. తన తండ్రి విధి నిర్వహణలో మరణించినందువల్ల తనకు ప్రభుత్వోద్యోగం పొందే అర్హత ఉందని నితీశ్ కుమార్ (26) చెప్తున్నారని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి నితీశ్‌ను కలవాలని వచ్చినట్లు తెలిపారని చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Aug 15 2023, 16:11

Vivah Muhurat in 2023 : బ్యాచ్‎లర్స్‎కి మాత్రమే.. ఆగస్ట్ టు డిసెంబర్‎లో పెళ్లికి ముహూర్తాలు ఇవే..!

హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వివాహమనే వేడుకలో రెండు కుటుంబాలకు చెందిన వధూవరులు ఒక్కటయ్యే వేళ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారత దేశంలో పెళ్లికి సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో పలు రకాల ఆచారాలు పాటిస్తారు. కొన్ని చోట్ల ఐదు రోజుల పెళ్లి, మరికొన్ని చోట్ల మూడు రోజుల పెళ్లిళ్లు జరుపుకుంటారు.

మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసీ ఏకంగా పదహారు రోజుల పాటు పండుగలా పెళ్లి చేసుకుంటారు. అందుకే భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది..

ఆగస్ట్ – 19, 20 ,22, 24, 26, 29, 30, 31

సెప్టెంబర్- 1, 2, 3, 6, 7, 8

అక్టోబర్ – 18, 19, 20 ,21, 22, 24 ,25, 26, 27 ,31

నవంబర్ – 1 ,2 ,8, 16 ,17, 18 ,19, 22 ,23, 24, 25, 28 ,29

డిసెంబర్ – 3 ,5 ,6, 7, 8 ,14, 15, 16 ,17 ,19, 20 ,21, 24, 31

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Aug 15 2023, 11:59

PM Modi: ఏకధాటిగా 90 నిమిషాలు.. ప్రసంగంలో మోదీ సరికొత్త రికార్డ్‌

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా చారిత్రక ఎర్రకోట (Red Fort) నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోదీ (PM Modi) నిలిచారు..

మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన.. పంద్రాగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇప్పటివరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా.. సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం..

2014లో ప్రధానమంత్రిగా ఎర్రకోట నుంచి మోదీ తొలి ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది 65 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు.

ఆ తర్వాత వరుసగా 88 నిమిషాలు (2015), 94 నిమిషాలు (2016), 56 నిమిషాలు (2017), 83 నిమిషాలు (2018), 92 నిమిషాలు (2019), 90 నిమిషాలు (2020), 88 నిమిషాలు (2021), 83 నిమిషాలు (2022) ప్రసంగించారు.

ఈ ఏడాది కూడా 90 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. మొత్తంగా ప్రధాని సగటు ప్రసంగం నిడివి 82 నిమిషాలు కాగా.. ఇప్పటివరకు ఏ ప్రధాని సగటుగా ఇంత సమయం ప్రసంగించలేదు..

నిజంనిప్పులాంటిది

Aug 15 2023, 09:18

Independence Day : ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా పదో సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాలకు శ్రీకారం చుట్టారు..

అంతకుముందు ప్రధాని మోదీ .. ఎర్రకోట దగ్గర త్రివిధ దళాల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు.

ప్రధాని మోదీ ప్రసంగం :

"ప్రపంచంలో మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనం విశ్వంలో నంబర్ 1గా ఉన్నాం. ఇంత విశాల దేశం.. 140 కోట్ల మంది జనాభాగా ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ఎన్నో సమస్యలున్నాయి. కేంద్ర, రాష్ట్రాలు కలిసి.. సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. మణిపూర్‌లో, మరికొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. కొంతమంది జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి.

ఐతే.. కొన్ని రోజులుగా మళ్లీ శాంతి కనిపిస్తోంది. మణిపూర్ ప్రజలతో ఈ దేశం ఉంది. శాంతితోనే సమాధానం లభిస్తుంది. కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి.. శాంతిని నెలకొల్పుతాం.

అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ సమాధి దగ్గర ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.

నిజంనిప్పులాంటిది

Aug 15 2023, 09:15

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 15

తిరుమలలో భక్తుల రద్దీ నేడు మంగళవారం పెరిగింది. స్వామివారి దర్శనం కోసం నేడు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 74,617 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.67 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

32,752 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

SB NEWS

*

నిజంనిప్పులాంటిది

Aug 14 2023, 20:21

ముగిసిన టీపీసీసీ ఎన్నికల కమిటీ భేటీ

రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఈ క్రమంలోనే సోమవారం గాంధీభవన్ లో టీ పీసీసీ ఎన్నికల, స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పలు విషయాలను భేటీలో చర్చించినట్లు తెలిసింది.

ఇక స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత సీఈసీకి తొలి జాబితా పంపనున్నారు. సెప్టెంబర్ లో అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయనున్నట్లు టీపీసీసీ ముఖ్య నేతలు తెలిపారు.

సెప్టెంబర్ మొదటివారంలో మరోసారి ఎన్నికల కమిటీ భేటీ కానుందని తెలిపారు.

ఈ భేటీలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కె.మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Aug 14 2023, 19:25

Revanth Reddy: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వైన్‌ షాపులకు మళ్లీ టెండర్లు: రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: భారాస ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నందునే.. సీఎం కేసీఆర్‌ అన్ని ఆస్తులు అమ్ముకుని విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు..

హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టడానికి జాగా లేదన్న కేసీఆర్.. నగరంలోని వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని నిలదీశారు.

100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, భూములు కొన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు.

గాంధీభవన్‌లో అలంపూర్‌, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు.. ఇవాళ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

వారందరికి రేవంత్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

మద్యం దుకాణాలను సొంత మనుషులకు అప్పగించేందుకే ముందుగానే టెండర్లు వేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వైన్‌ షాపులకు మళ్లీ టెండర్లు పిలుస్తామన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని పోలీసు అధికారులనుద్దేశించి రేవంత్‌ మాట్లాడారు..

నిజంనిప్పులాంటిది

Aug 14 2023, 18:39

తెలంగాణ పోలీసులకు సేవా పతకాలను ప్రకటించిన కేంద్రం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాల ను ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించింది.

తెలంగాణ నుంచి 34 మంది ఎంపిక కాగా.. ఏపీ నుంచి 29 మంది పోలీసులకు పతకాలు దక్కాయి. ఏపీ నుంచి ఒక్కరికి రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకం, 18 మందికి పోలీస్‌ గ్యాలంటరీ పతకాలు, 10 మందికి విశిష్ఠ సేవా పతకాలకు ఎంపికయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 22 మందికి పోలీస్‌ గ్యాలంటరీ, పది మందికి పోలీస్‌ సేవా పతకాలు, మరో ఇద్దరు తెలంగాణ అదనపు డీజీ విజయ్‌ కుమార్‌, ఎస్పీ మాదాడి రమణ కుమార్‌లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు...

ఎస్పీ భాస్కరన్, ఇన్‌స్పెక్టర్లు.. శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్‌ఐ బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్‌కానిస్టేబుళ్లు.. ఆదినారాయణ, అశోక్ గ్యాలంటరీ పతకాలు పొందారు.

గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కానిస్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్‌ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్ తదితరులు.

తెలంగాణ నుంచి పోలీస్‌ సేవా పతకాలు లభించిన పది మంది పోలీసుల వివరాలు :

బండి వెంకటేశ్వర రెడ్డి అదనపు ఎస్పీ, ఖైరతాబాద్,

మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు అదనపు ఎస్పీ,

ఆత్మకూరి వెంకటేశ్వరి అదనపు ఎస్పీ,

ఆందోజు సత్యనారాయణ ఆర్ఎస్ఐ,

కక్కెర్ల శ్రీనివాస్ ఆర్ఎస్ఐ,

మహంకాళి మధు ఆర్ఎస్ఐ,

అజెల్ల శ్రీనివాస రావు ఆర్ఐ,

రసమోని వెంకటయ్య సీనియర్ కమాండో,

అరవేటి భాను ప్రసాద్ రావు ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్,

సాయన వెంకటేశ్వర్లు ఏఎస్ఐ...

నిజంనిప్పులాంటిది

Aug 14 2023, 18:37

ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.

పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో 60 ఏండ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది.

హైదరాబాద్‌ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి అందించే టీ-24 టికెట్‌ను అందరికీ కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది.

పిల్లలకు మాత్రం టీ-24 టికెట్‌ను రూ.50కే అందజేయనున్నది. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.